ట్రెండింగ్
Epaper    English    தமிழ்

40 ఏళ్ల తర్వాత విడుదల కానున్న అక్కినేని సినిమా

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 17, 2022, 12:18 PM

దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు నటించిన 'ప్రతిబింబాలు' సినిమా 40 ఏళ్ల తర్వాత విడుదల కానుంది. ఈ సినిమాలో సీనియర్‌ నటి జయసుధ హీరోయిన్ గా నటించింది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణ ఈ సినిమాను రూపొందించారు. అనివార్య కారణాల వల్ల అప్పట్లో విడుదల కాని ఈ సినిమాను సరికొత్త హంగులతో సెప్టెంబరు 20న అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. అయితే అప్పట్లో ఈ చిత్రం కంప్లీట్ అయినా కూడా పలు కారణాల చేత రిలీజ్ కి నోచుకోలేదట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com