నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా, 2014లో విడుదలైన "కార్తికేయ"కు సీక్వెల్ గా తెరకెక్కిన చిత్రం "కార్తికేయ 2". చందూ మొండేటి డైరెక్షన్లో మిస్టికల్ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం ఇటీవల విడుదలై సూపర్ పాజిటివ్ టాక్ తో థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులతో దూసుకుపోతుంది.
ఒక్క ఇండియాలోనే కాక ఓవర్ సీస్ లో కూడా కార్తికేయ 2 కలెక్షన్స్ జోరు చూపిస్తున్నాయి. లేటెస్ట్ గా కార్తికేయ 2 కలెక్షన్స్ 700కే + మార్కును అందుకుంది. ఈ వారంలోనే మిలియన్ మార్కును అందుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు.