టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో 'SSMB 28' సినిమా రానుంది.ఈ సినిమాలో హీరోయినిగా పూజా హెగ్డే నటించనుంది.తాజాగా ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు చిత్రబృందం. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని హారిక అండ్ హాసిని బ్యానర్ నిర్మిస్తున్నారు.