కృష్ణ చైతన్య దర్శకత్వంలో ప్రామిసింగ్ యాక్టర్ శర్వానంద్ ఒక ఫామిలీ ఎంటర్టైనర్ మూవీని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో శర్వానంద్ సరసన గ్లామర్ బ్యూటీ రాశి ఖన్నా జంటగా నటిస్తుంది. తాజాగా ఈరోజు ఉదయం హైదరాబాద్లో లాంఛనంగా ఈ సినిమా ప్రారంభమైంది. ఈ లాంచ్ ఈవెంట్ కి ప్రధాన జంట శర్వా మరియు రాశి ఖన్నా హాజరయ్యారు. స్టార్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లాప్బోర్డ్ను అందించారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి చెందిన టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa