ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆకతాయి నెటిజన్ ట్వీట్ ... కృష్ణవంశీ హుందా రిప్లై

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 08, 2022, 04:15 PM

టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ డైరెక్ట్ చెయ్యబోతున్న 21 వ సినిమా "రంగ మార్తాండ". 'మన అమ్మానాన్నల కథ' శీర్షిక. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఇళయరాజా పనిచేస్తున్నారు. కీలక పాత్రల్లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, బహుముఖ నటి రమ్యకృష్ణ నటిస్తున్నారు. లేట్ లెజెండ్ సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆఖరిగా ఈ సినిమాలోని గీతాలకు సాహిత్యమందించారు. హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారు. ఈ సందర్భంగా చిరంజీవికి కృష్ణవంశీ కృతజ్ఞతలు తెలుపుతూ స్పెషల్ ట్వీట్ చేసాడు. అందుకు ఒక ఆకతాయి నెటిజన్ 'ఇది పోయినట్టే' అని కామెంట్ చేసాడు. అంటే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడం ఖాయమన్నట్టు ముందే జ్యోతిష్యం చెప్పాడు. ఐతే, ఈ నెటిజన్ నెగిటివ్ ట్వీట్ కు అనుభవజ్ఞుడైన కృష్ణవంశీ మాత్రం "గాడ్ బ్లెస్ యూ" అంటూ చాలా హుందాగా రిప్లై ఇచ్చారు. నెటిజన్ జోస్యం నిజమవ్వకూడదని, ఈ సినిమాతోనైనా కృష్ణవంశీ గ్రాండ్ సక్సెస్ అందుకుని హిట్ ట్రాక్ ఎక్కాలని ప్రేక్షకాభిమానులు కోరుకుంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com