ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కృష్ణవంశీ "రంగ మార్తాండ" పై లేటెస్ట్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 12, 2022, 09:02 AM

టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ డైరెక్ట్ చెయ్యబోతున్న 21 వ సినిమా "రంగ మార్తాండ". 'మన అమ్మానాన్నల కథ' అనేది శీర్షిక. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా పనిచేస్తున్నారు. కీలక పాత్రల్లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, బహుముఖ నటి రమ్యకృష్ణ నటిస్తున్నారు.


లేట్ లెజెండ్ సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆఖరిగా ఈ సినిమాలోని గీతాలకు సాహిత్యమందించారు. హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారు.


తాజా సమాచారం ఏంటంటే, ఈ మూవీ డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని వినికిడి. ఈ మేరకు ప్రకాష్ రాజ్ తన పాత్రకు డబ్బింది చెప్తున్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఎనౌన్స్మెంట్ వీడియోతో ఒక విభిన్నమైన సినిమాగా ప్రేక్షకుల అటెన్షన్ ను గ్రాస్ప్ చేసిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ విడుదలైతే కానీ, యేతరహా కథతో కృష్ణవంశీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారన్నది క్లారిటీ వచ్చేలా లేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa