కోలీవుడ్ డైరెక్టర్ చెల్లా అయ్యావు డైరెక్షన్లో విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటిస్తున్న చిత్రం "మట్టి కుస్తీ". తమిళంలో "గట్ట కుస్తీ" పేరుతో తెరకెక్కుతుంది. మాస్ రాజా రవితేజ తో కలిసి విష్ణు విశాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
రీసెంట్గానే ఈ సినిమా నుండి చల్ చక్కని చిలక అనే ఫస్ట్ సింగిల్ రిలీజవ్వగా, తాజాగా మేకర్స్ పోకిరోడే అనే సెకండ్ సింగిల్ ను విడుదల చెయ్యడానికి ముహూర్తం ఖరారు చేసారు. ఈ మేరకు ఈ రోజు సాయంత్రం ఆరింటికి పోకిరోడే లిరికల్ సాంగ్ విడుదల కాబోతుంది.
క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన పూర్తి స్థాయి కుటుంబ కధా చిత్రమిది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 2న తెలుగు, తమిళ భాషలలో విడుదల కాబోతుంది.