ఈ మధ్య కాలంలో సినిమా రిలీజ్కి ముందు చిత్ర యూనిట్ సభ్యులు తిరుమలకి వెళ్లి అక్కడ తిరుమలేశుని ఆశీస్సులు అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో రేపు రిలీజ్ కాబోతున్న జై లవకుశ చిత్రం పెద్ద సక్సెస్ కావాలని చిత్ర యూనిట్ ఈ రోజు శ్రీవారిని దర్శించుకుంది. వీఐపీ విరామ సమయంలో చిత్ర దర్శకుడు బాబీ, రచయిత కోన వెంకట్, టెక్నికల్ టీం స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. సినిమా రిలీజ్కి ముందు స్వామి వారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని దర్శకుడు బాబీ తెలిపారు. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంలో తెరకెక్కిన జై లవకుశ టీజర్, ట్రైలర్, ఆడియోకి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మూవీ కూడా బిగ్గెస్ట్ హిట్ అవుతుందనే ఆలోచనలో చిత్ర దర్శక నిర్మాతలు ఉన్నారు. నందమూరి ఆర్ట్స్ బేనర్పై కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ చిత్రంలో జూనియర్ జై, లవ, కుశ అనే మూడు విభిన్న పాత్రలలో కనిపించనుండగా ఆయన సరసన నివేదా థామస్, రాశీ ఖన్నా కథానాయికలుగా నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa