మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ ను ముందుకు సాగిస్తున్న కొద్దీ అన్నింటిలో తన ఆలోచన ధోరణని ఎంతగానో మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో చరణ్ కి ఇప్పటి చరణ్ కు చాలా తేడాలు కనిపిస్తున్నాయి. నటనపరంగానే కాకుండా నిజ జీవితంలో చరణ్ జీవన విధానం ఆకట్టుకుంటోంది. ఇకపోతే ప్రస్తుతం వినయ విధేయ రామ ప్రమోషన్ లో బిజీగా ఉన్న చరణ్ ఆ సినిమా కన్నా వేరే విషయాల గురించి ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుతూన్నాడు.
బాలీవుడ్ ఎంట్రీపై మరోసారి మెగా హీరో తన ఆలోచనని వివరించాడు. చరణ్ 2013లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్ ఐకానిక్ ఫిల్మ్ జంజీర్ ను 2013లో సేమ్ టైటిల్ తో రీమేక్ చేయగా.. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన రిజల్ట్ ను అందుకుంది. ఇకపోతే మరోసారి బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తారా అని ఇటీవల అడిగిన ప్రశ్నకు చరణ్ ఈ విధంగా సమాధానం ఇచ్చాడు.
నేను మళ్ళీ బాలీవుడ్ కి వెళ్లే ప్లాన్స్ అయితే లేవు. చాలా కాలం తరువాత తెలుగు సినిమాలు కూడా బాలీవుడ్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా కలెక్షన్స్ సాధిస్తున్నాయి. మంచి మార్కెట్ కూడా సెట్టయ్యింది. ఇక నేను తిరిగి బాలీవుడ్ వెళ్లాల్సిన అవసరం లేదని అనుకుంటున్నట్లు చరణ్ తన వివరణ ఇచ్చాడు. చరణ్ చెప్పింది నిజంగా కరెక్ట్.. మన సినిమాల హడావుడి బాలీవుడ్ కి ఏ మాత్రం తీసిపోని విదంగా కలెక్షన్స్ సాధించే సత్తా ఉన్నట్లు కొన్ని సినిమాలు నీరూపిస్తున్నాయి. RRR అక్కడ కూడా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది గనుక డబ్బింగ్ మూవీతో హిట్ కొడితే ఆ కిక్కే వేరు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa