ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'పఠాన్' వివాదంలో జోక్యం చేసుకున్న సెన్సార్ బోర్డు..?

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 29, 2022, 06:41 PM

నాలుగేళ్ళ విరామం తదుపరి బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నుండి రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం "పఠాన్". సిద్దార్ధ్ ఆనంద్ డైరెక్షన్లో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 25న హిందీ, తెలుగు, తమిళ భాషలలో విడుదల కాబోతుంది.


రేసెంట్గానే పఠాన్ నుండి 'బేషరం రంగ్' వీడియో సాంగ్ విడుదలై ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచిన విషయం అందరికి తెలుసు. అలానే ఈ సాంగ్ ఎంతటి కాంట్రవర్సీని సృష్టించిందో కూడా తెలిసిందే. ఈ సాంగ్ లో దీపికా సాఫ్రాన్ కలర్ బికినీ ధరించి, షారుఖ్ వంటి సీనియర్ స్టార్ హీరో సరసన కొన్ని అసభ్యకరమైన సీన్లలో నటించింది. దీంతో పఠాన్ పై కొంతమంది ఆన్ లైన్ అండ్ ఆఫ్ లైన్ ..రెండిటిలో తెగ విరుచుకుపడుతున్నారు.


ఈ నేపథ్యంలో పఠాన్ సినిమా మేకర్స్ కి సెన్సార్ బృందం నుండి ఒక ఆర్డర్ వెళ్లిందట. సినిమాలో కొన్ని కీలకమైన మార్పులు చెయ్యమని ముఖ్యంగా పాటలలో తప్పక మార్పులు చెయ్యాలని సెన్సార్ బృందం పఠాన్ మేకర్స్ ని ఆదేశించినట్టు తెలుస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa