పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సాహో ఫేమ్ సుజీత్ తో సినిమా చెయ్యబోతున్నట్టు రీసెంట్గానే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ జరిగింది. DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై DVV దానయ్య గారు ఈ సినిమాను నిర్మించనున్నారు. రవి కే చంద్రన్ గారు సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు. ఈ మేరకు విడుదలైన అఫీషియల్ పోస్టర్ ప్రేక్షకుల అటెన్షన్ ఇట్టే గ్రాస్ప్ చేసింది.
తాజా సమాచారం ప్రకారం, ఈ నెల 30వ తేదీన అంటే రేపు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమాను ప్రారంభించబోతున్నట్టు కాసేపటి క్రితమే మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. ఈ మేరకు నిన్నటి వరకు జోరుగా జరిగిన ప్రచారం గురించి తెలిసిందే.