'జబర్దస్త్' ఫేమ్ వేణు టిల్లు దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం "బలగం". ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా నటిస్తున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్, హన్షిత నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శిరీష్ సమర్పిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటివరకు విడుదలైన లిరికల్ సాంగ్స్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుండగా, తాజాగా చిత్రబృందం ట్రైలర్ రిలీజ్ కి సిద్ధమయ్యింది. ఈ మేరకు రేపు ఉదయం పదకొండు గంటలకు బలగం ట్రైలర్ విడుదల కాబోతుందని కాసేపటి క్రితమే మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు.
పోతే, మార్చి 3వ తేదీన ఈ సినిమా విడుదల కావడానికి రెడీ అవుతుంది.