సంక్రాంతి కానుకగా విడుదలైన స్టార్ హీరోల సినిమాలు ఒక్కొక్కటిగా 50రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంటున్నాయి. మొన్న తునివు, వారిసు, నిన్న వీరసింహారెడ్డి, తాజాగా వాల్తేరు వీరయ్య సక్సెస్ఫుల్ 50డేస్ థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. జనవరి 13న విడుదలైన ఈ సినిమా 250కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి మెగా మాస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
బాబీ ఈ సినిమాకు దర్శకుడు కాగా, మెగాస్టార్ చిరంజీవి, మాస్ రాజా రవితేజ ప్రధానపాత్రలు పోషించారు. శ్రుతిహాసన్, క్యాథెరిన్ ట్రెసా, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, బాబీ సింహ, వెన్నెల కిషోర్, సుబ్బరాజ్ కీరోల్స్ లో నటించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించగా, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.