కతిరేసన్ దర్శకత్వంలో రాఘవ లారెన్స్ ఒక యాక్షన్ థ్రిల్లర్లో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ చిత్రానికి 'రుద్రుడు' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లారెన్స్ సరసన జోడిగా ప్రియా భవానీ శంకర్ నటిస్తోంది. ఈ చిత్రం వచ్చే నెల 14న విడుదలకు సిద్ధంగా ఉంది.
లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని పూర్వీ పిక్చర్స్, ఠాగూర్ మధు 6.5 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ఎల్పి ఈ చిత్రాన్నినిర్మిస్తుంది.