టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవల విడుదలైన రొమాంటిక్ థ్రిల్లర్ 'వినరో భాగ్యము విష్ణు కథ' తో మంచి హిట్ సాధించాడు. తాజాగా ఇప్పుడు, నూతన దర్శకుడు రమేష్ కడూరి దర్శకత్వంలో తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'మీటర్' అనే టైటిల్ ని ఖరారు చేసారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా యొక్క పోస్ట్ థియేట్రికల్ హక్కులను జెమినీ టీవీ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఏప్రిల్ 7, 2023న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కోలీవుడ్ బ్యూటీ అతుల్య రవి కథానాయికగా నటిస్తోంది.
ప్రముఖ సంగీత స్వరకర్త సాయి కార్తీక్ ఈ సినిమాకి సౌండ్ట్రాక్ను స్కోర్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, చిరంజీవి (చెర్రీ) క్లాప్ ఎంటర్టైన్మెంట్తో కలిసి ఈ ప్రాజెక్ట్ను నిర్మిస్తుంది.