మారుతీ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. ఈ సినిమాకి "రాజా డీలక్స్" అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసినట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్ట్ తదుపరి షెడ్యూల్కు సిద్ధమవుతోందని ఇన్సైడ్ టాక్. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో 7 ఎకరాల్లో 19వ శతాబ్దపు భవనాన్ని చిత్రీకరిస్తూ చిత్ర యూనిట్ ఒక భారీ సెట్ను ఏర్పాటు చేసింది.
ఈ చిత్రాన్ని మే 2024లో విడుదల చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. క్రైమ్ కామెడీ ట్రాక్ లో రానున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, మరియు రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా, సంజయ్ దత్ మరియు సత్యరాజ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.