మణిరత్నం యొక్క మాగ్నమ్ ఓపస్ పొన్నియిన్ సెల్వన్-2 ఏప్రిల్ 28, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్కి సిద్ధంగా ఉంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 170 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. ఈ ఎపిక్ పీరియడ్ డ్రామాలో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్ బచ్చన్ మరియు త్రిష కృష్ణన్, నాజర్, ప్రభు కీలక పాత్రలు పోషించారు.
ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా IMAX, EPIQ మరియు 4DX ఫార్మాట్లలో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. మద్రాస్ టాకీస్తో కలిసి లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ బిగ్గీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
'PS-2' ప్రీ రిలీజ్ బిజినెస్ ::::::
తమిళనాడు - 80 కోట్లు
తెలుగు రాష్ట్రాలు - 10 కోట్లు
కేరళ - 9 కోట్లు
హిందీ + KA + ROI - 21 కోట్లు
ఓవర్సీస్ - 50 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 170 కోట్లు