కార్తీక్ దండు దర్శకత్వంలో సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన 'విరూపాక్ష' సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో ఏప్రిల్ 21, 2023న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది.
లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 65 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా హిందీ, తమిళం, మలయాళం భాషల్లో కూడా విడుదలవుతున్నందున 100 కోట్ల గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ పండిట్స్ అంచనా వేస్తున్నారు.
ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన సంయుక్త మీనన్ రొమాన్స్ చేయనుంది. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, అజయ్, సునీల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.