కార్తీక్ దండు దర్శకత్వంలో సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన 'విరూపాక్ష' సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో ఏప్రిల్ 21, 2023న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ మిస్టికల్ థ్రిల్లర్ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల గ్రాస్ మార్క్ సాధించి ఈ ఘనత సాధించిన సాయి ధరమ్ తేజ్ యొక్క మొదటి చిత్రంగా నిలిచింది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో చిన్న వీడియో గ్లింప్సె ని విడుదల చేసి అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన సంయుక్త మీనన్ రొమాన్స్ చేయనుంది. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, అజయ్, సునీల్, రాజీవ్ కనకాల, సోనియా సింగ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. అజనీష్ లోక్నాథ్ ఈ సినిమాకి సంగీతం అందించారు.