ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేణు దేశాయ్ రాజకీయ రూమర్లపై స్పందించింది

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 28, 2019, 11:26 AM

రేణు దేశాయ్.. తెలుగు ప్రజలందరికీ సుపరిచితమైన పేరు ఇది. పవన్ సరసన బద్రీ సినిమాతో తెరంగేట్రం చేసిన రేణు.. తర్వాత జానీ మూవీలోనూ నటించారు. ఆమె సినీ ప్రస్థానం అక్కడితో ఆగిపోయింది. కానీ పవన్‌తో సహజీవనం.. పెళ్లి కారణంగా ఆమె స్టార్ హోదాను పొందారు. తర్వాత పవన్‌ నుంచి విడాకులు తీసుకున్న రేణు.. నిర్మాతగా మారారు. మరో వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నానంటూ కొంత కాలం క్రితం సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.

అయితే ఆ విషయం పక్కన పెడితే రేణు దేశాయ్ మొన్న కర్నూల్ పర్యటనలో రైతుల ఆత్మహత్యల గురించి ఒక టీవీ షోలో చేస్తుందని వార్తలు వచ్చాయి.  ఈ షో వెనక రాజకీయ కారణాలు ఉన్నాయని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. దీంతో రేణు దేశాయ్ ఆ ఆరోపణలపై స్పందిస్తూ "నేను మనస్ఫూర్తిగా ఈ షోను రైతులకోసమే చేస్తున్నాను. ఇందులో ఎటువంటి రాజకీయ కోణాలు లేవు. నేను వందలమంది రైతులను కలవడం జరిగింది. వారి సమస్యలు తెలుసుకొని చలించిపోయాను.  నేను కనీసం ఒక్క రైతుకు అయినా సహాయపడినా.. నా వల్ల ఒక్క రైతు జీవితంలో మార్పు వచ్చినా నాకంతకంటే సంతోషం లేదు" అంటూ క్లారిటీ ఇచ్చింది. 



రేణుకు పొలిటికల్ గోల్స్ ఉన్నాయో లేదో తెలీదు కానీ చాలామంది నెటిజనులు తన వివరణపై పూర్తిగా సంతృప్తి చెందడం లేదు.  రేణు దేశాయ్ ఆ షో చేయడం వెనక ఉద్దేశం మంచిది అయి ఉండొచ్చుగానీ త్వరలో ఎలెక్షన్స్ రానుండడంతో ఇది రాజకీయాల కారణాలతో రూపొందించిన షో అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.   అలా అని రేణుకు మద్దతిచ్చే వాళ్ళు లేకపోలేదు.. రైతు సమస్యలను ప్రజల దృష్టికి తెచ్చేందుకు టీవీ షో చేయడం అనేది ఒక మంచి ఆలోచన అని.. నిజానికి రైతుల సమస్యలకు సంబంధించి ఇలాంటి షోలు మరి కొందరు కూడా చేయాలని అంటున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa