రంగస్థలం చిత్రంలో పాటలన్నీ అదరగొట్టిన దేవిశ్రీప్రసాద్ 'భరత్ అనే నేను'లో కూడా రెండు పాటలతో మెప్పించాడు. అయితే ఆ తర్వాత వరుసగా బ్యాడ్ ఆల్బమ్స్తో నిరాశ పరిచిన దేవి మళ్లీ ఇన్నాళ్లకు సత్తా చాటుకుంటున్నాడు. 'మహర్షి'లో తొలి పాట 'చోటి చోటి బాతేన్' బాగా హిట్టయింది. ఇందులో మిగతా పాటలు కూడా చాలా బాగా చేసాడని చెబుతున్నారు. అలాగే చిత్రలహరిలో ఇంతవరకు రిలీజ్ అయిన పాటలన్నీ మెప్పించాయి. గత వారం విడుదలైన 'గ్లాస్ మేట్స్' ఎఫ్ఎంలలో బాగా మోగుతోంది.
తాజాగా ప్రేమ వెన్నెల పాటతో మరోసారి దేవి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈమధ్య కాలంలో అతను స్వరపరిచిన ఉత్తమ గీతాల్లో ఇది ఒకటని అంటున్నారు. కెరియర్ పరంగా అత్యంత ఇబ్బందికర స్థితిలో వున్న సాయి ధరమ్ తేజ్కి 'చిత్రలహరి' పాటలకి వస్తోన్న స్పందనతో ఆనందం ఉరకలేస్తోంది. కొన్నాళ్ల పాటు డౌన్లో వున్న దేవి ఇప్పుడు మళ్లీ లేచాడు కనుక అతని పోటీదారులైన తమన్లాంటి వారికి మళ్లీ ఛాలెంజ్ ఎదురవుతుంది. చోటి చోటి బాతేన్ పాట అయిదు మిలియన్ల వ్యూస్ దిశగా దూసుకెళుతోండగా, గ్లాస్మేట్స్ కూడా రెండు మిలియన్లు రీచ్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa