చందూ మొండేటి దర్శకత్వంలో టాలీవుడ్ యువ సామ్రాట్ నాగ చైతన్య తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'తాండల్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ పాన్ ఇండియన్ యాక్షన్ డ్రామా చైతన్య కెరీర్లోనే అత్యంత భారీ వ్యయంతో కూడుకున్న ప్రాజెక్ట్. ఈ సినిమా ఫిబ్రవరి 7, 2025న విడుదల కానుంది. ఈ సినిమాలోని ఫస్ట్ సింగల్ ని బుజ్జి తల్లి అనే టైటిల్ తో మూవీ మేకర్స్ ఇటీవలే విడుదల చేసారు. దేవి శ్రీ ప్రసాద్ కంపోస్ చేసిన ఈ సాంగ్ కి జావేద్ అలీ తన గాత్రాన్ని అందించారు. తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ యూట్యూబ్ లో టాప్ ట్రేండింగ్ 2 పోసిషన్ లో ఉన్నట్లు సమాచారం. బుజ్జి తల్లి పాట భారీ చార్ట్బస్టర్గా నిలిచింది సినిమాపై ఉన్న అంచనాలను తదుపరి స్థాయికి తీసుకువెళ్లింది. శ్రీకాకుళానికి చెందిన రాజు అనే మత్స్యకారుడిగా చై నటించారు. రాజు పాక్ జలాల్లోకి ప్రవేశించిన తర్వాత పాక్ తీర రక్షకులు అతన్ని పట్టుకున్నారు. ఈ చిత్రం 2018లో జరిగిన యదార్థ సంఘటనల నుండి ప్రేరణ పొందింది. ఈ చిత్రంలో సాయి పల్లవి కథనాయికగా నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణంలో ఉంది. ఈ సినిమాలో ప్రియదర్శి, దివ్య పిళై కీలక పాత్రలలో నటిస్తున్నారు. "తాండేల్" దాని ఆకట్టుకునే కథాంశంతో మరియు దేవిశ్రీ ప్రసాద్ సంగీతంతో భారీ అంచనాలని కలిగి ఉంది. GA2 పిక్చర్స్ క్రింద బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాని సమర్పిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa