ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెటిజన్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నిధి అగర్వాల్

cinema |  Suryaa Desk  | Published : Wed, Dec 04, 2024, 02:29 PM

బాలీవుడ్ నుంచి చాలా మంది హీరోయిన్స్ టాలీవుడ్ లో లు చేసిన విషయం తెలిసిందే.. అలా వచ్చిన వారిలో నిధి అగార్వల్ ఒకరు. బాలీవుడ్ లో మున్నా మైఖేల్ అనే లో నటించింది ఈ అమ్మడు.ఆతర్వాత 2018లో వచ్చిన సవ్యసాచి తో తెలుగులోకి అడుగుపపెట్టింది. అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య నటించిన ఈ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఆతర్వాత నాగచైతన్య తమ్ముడు అఖిల్ తో కలిసి చేసింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో మిస్టర్ మజ్ను లో నటించింది. కానీ ఈ కూడా నిరాశపరిచింది. ఇక 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో హిట్ అందుకుంది. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ లో నిధి తన అందాలతో ఆకట్టుకుంది.ఈ లో తన నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది ఈ అమ్మడు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఈ చిన్నదనికి వరుస అవకాశాలు వచ్చాయి. అలాగే తమిళ్ లోనూ అవకాశాలు అందుకుంది. తమిళ్ లో శింబు, జయం రవి సరసన లు చేసింది ఈ అమ్మడు. అలాగే మహేష్ బాబు మేనల్లుడు అశోక్ లో నటించింది. ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లో అవకాశం అందుకుంది. హరిహరవీరమల్లు లో ఈ ముద్దుగుమ్మ నటిస్తుంది. ఇదిలాఉంటే తాజాగా నిధి అగర్వాల్ నెటిజన్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది.


సోషల్ మీడియాలో నెటిజన్స్ తో మాట్లాడింది ఈ అమ్మడు. నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలోనే 'మీకు తెలుగు వచ్చా మేడమ్‌?' అని ఓ నెటిజన్‌ అడగ్గా దానికి నిధి అగర్వాల్ ఆసక్తికర సమాధానం ఇచ్చింది. నాకు తెలుగు వస్తుందండీ.. ఎందుకు మీకు ఆ డౌట్ ? 'అందరికీ నమస్కారం' అని చెప్పే బ్యాచ్‌ కాదు నేను' అనిచెప్పుకొచ్చింది నిధి అగర్వాల్. అలాగే ప్రభాస్ రాజా సాబ్ సెట్ లో ఫన్నీ మూమెంట్స్‌ ఉన్నాయి అని తెలిపింది. అలాగే పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి అంటే..'చాలా మంచి వారు. ఆయన ఓ లెజెండ్‌, పవర్‌ఫుల్‌ కళ్లు.. ఇలా ఆయన గురించి చాలా చెప్పొచ్చు. ఒక్క మాటలో అంటే కష్టం' అని తెలిపింది నిధిఅగార్వల్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa