ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐశ్వర్యా రాజేష్‌ బాల నటిగా నటించిన ఏకైక తెలుగు సినిమా

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 17, 2025, 03:34 PM

ఐశ్వర్యా రాజేష్‌ పేరు ఇప్పుడు టాలీవుడ్‌ మోగిపోతుంది. అంతా ఇప్పుడు ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు. త్వరలో ఆమె తెలుగులో బిజీ హీరోయిన్‌ అయిపోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కారణం `సంక్రాంతికి వస్తున్నాం` సినిమాలో ఆమె నటించడం. వెంకటేష్‌ హీరోగా నటించిన ఈ మూవీలో ఐశ్వర్యా రాజేష్‌, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంగళవారం విడుదలై బ్లాక్‌ బస్టర్ టాక్‌ తో రన్‌ అవుతుంది. ఐశ్వర్యా రాజేష్‌ పేరు ఇప్పుడు టాలీవుడ్‌ మోగిపోతుంది. అంతా ఇప్పుడు ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు. త్వరలో ఆమె తెలుగులో బిజీ హీరోయిన్‌ అయిపోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కారణం `సంక్రాంతికి వస్తున్నాం` సినిమాలో ఆమె నటించడం. వెంకటేష్‌ హీరోగా నటించిన ఈ మూవీలో ఐశ్వర్యా రాజేష్‌, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంగళవారం విడుదలై బ్లాక్‌ బస్టర్ టాక్‌ తో రన్‌ అవుతుంది. దీంతో ఐష్‌ నటన గురించే అంతా మాట్లాడుకుంటారు. ఈ సందర్భంగా ఐశ్వర్యా రాజేష్‌కి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. వారిది తెలుగు ఫ్యామిలీ అనే విషయం తెలిసిందే. ఆమె తండ్రి రాజేష్‌ అప్పట్లో మంచి నటుడు. హీరోగానూ సినిమాలు చేశారు. విజయాలు అందుకున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, కృష్ణంరాజు వంటి వారి సినిమాల్లోనూ నటించారు. హీరోగా, విలన్‌గా మెప్పించారు. చిన్న వయసులోనే కన్నుమూశారు. ఇదిలా ఉటే ఐశ్వర్యా బాలనటిగానూ నటించారు. ఆమె నటిగా తెరంగేట్రం చేసింది తెలుగు సినిమాతోనే. అది రాజేంద్రప్రసాద్‌ నటించిన `రాంబంటు` సినిమాలో ఐశ్వర్యా రాజేష్‌ బాల నటిగా నటించింది. ఇందులో ఓ చిన్న రోల్‌లో ఆమె మెరిసింది. `ఏమో గుర్రం ఎగరా వచ్చు` అనే పాటలో బేబీ ఐశ్వర్యా కాసేపు కనిపిస్తుంది. రాజేంద్రప్రసాద్‌ కూతురిగా కనిపిస్తుంది. బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌ హీరోగా నటించగా, ఆయనకు జోడీగా ఈశ్వరీ రావు హీరోయిన్‌గా నటించడం విశేషం. ఆమె ఇప్పుడు మదర్‌ పాత్రలతో మెప్పిస్తున్న విషయం తెలిసిందే. కైకాల సత్యనారాయణ, కోటా శ్రీనివాసరావు ముఖ్య పాత్రలు పోషించారు. 1995లో విడుదలైన ఈ మూవీ పెద్ద విజయం సాధించింది. ఇందులో కామెడీతోనే కాదు, యాక్షన్‌తోనూ అదరగొట్టారు రాజేంద్రప్రసాద్‌. బాలనటిగా `రాంబట్టు` ఒక్క చిత్రానికే పరిమితమైన ఐశ్వర్యా రాజేష్‌.. తమిళంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. `కౌసల్య కృష్ణమూర్తి` సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. `మిస్‌ బ్యాచ్‌`, `వరల్డ్ ఫేమస్‌ లవర్‌`, `టక్‌ జగదీష్‌`, `రిపబ్లిక్‌` చిత్రాలు చేసింది.కానీ అన్నీ పరాజయం చెందాయి. ఇప్పుడు చేసిన `సంక్రాంతికి వస్తున్నాం` మూవీ ఆమెకి తెలుగులో బ్రేక్‌ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇకపై టాలీవుడ్‌లో ఐశ్వర్యా రాజేష్‌ బిజీ అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com