సోషల్ మీడియాలో వివాదాస్పద ట్వీట్లు చేసినందుకు గాను పలు కేసుల్లో ఇరుకున్న రామ్ గోపాల్ వర్మ నిన్న పోలీసుల విచారణ కు హాజరైన సంగతి తెలిసిందే.విచారణ అనంతరం ఆయనకు మరో కేసులో పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఆర్జీవీ శనివారం మరోసారి వివాదాస్పద ట్వీట్ చేశారు. ఆర్జీవీ ట్వీట్లో.. ఐ లవ్ ఒంగోల్.. ఐ లవ్ ఒంగోల్ పోలీస్ ఈవెన్ మోర్.. 3 ఛీర్స్ అంటూ.. పెగ్గుతో ఉన్న ఫోటోను రాంగోపాల్ వర్మ పోస్ట్ చేశారు.. 9 గంటల విచారణ తర్వాత వచ్చి.. మందు తాగుతున్న ఫోటోల ను ఎక్స్లో షేర్ చేశాడు. దీంతో అతని తీరుపై సోషల్ మీడియా లో తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. విచారణకు పిలిచిన ఆర్జీవీ తీరు మారలేదని కామెంట్లు చేస్తున్నారు. కాగా మరికొందరు.. ఆ ఫొటోలో ఆర్జీవీ చేతిలో ఉన్నది మందు గ్లాస్ కాదని కేవలం మంచి నీటి గ్లాసు మాత్రమే అంటూ అతనికి సపోర్ట్ గా నిలుస్తున్నారు.చంద్రబాబు, పవన్ కల్యాణ్ మార్ఫింగ్ ఫొటోల కేసుకు సంబంధించిన ఆయనకు శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకూ ఒంగోలు రూరల్ పోలీస్టేషన్ లో విచారణ చేపట్టారు. మొత్తం 50 ప్రశ్నలను పోలీసులు సంధించారు. 44 ప్రశ్నలకు రామ్ గోపాల్ వర్మ సమాధానం చెప్పారు. కొన్ని ప్రశ్నలకు తనకు గుర్తు లేదని, తెలియదు అని ఆర్జీవీ తెలిపారు. దీంతో ఆయనకు కొంత సమయం ఇచ్చిన సమాధానం చెప్పలేకపోయారు. ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మ స్టేట్మెంట్ను నమోదు చేశారు. మరోసారి విచారణకు రావాలని సూచించిన సంగతి తెలిసిందే. విచారణ ముగియడంతో ఆయన పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్లారు.
I LOVE ONGOLE AND I LOVE ONGOLE POLICE EVEN MORE. 3 CHEEERS pic.twitter.com/vmjNW7ALdL
— Ram Gopal Varma (@RGVzoomin) February 7, 2025
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa