శ్వేతా బసు ప్రసాద్.. తెలుగు సినీప్రియులకు పరిచయం అవసరంలేని పేరు. తొలి చిత్రంతోనే ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. యంగ్ హీరో వరుణ్ సందేశ్ నటించి కొత్త బంగారు లోకం తో తెలుగు తెరకు పరిచయమైంది.ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ తో శ్వేతా బసు ప్రసాద్ పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. అందం, చూడచక్కని రూపంతో కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మకు ఆ తర్వాత ఇండస్ట్రీలో ఆఫర్స్ వచ్చినప్పటికీ అంతగా క్రేజ్ రాలేదు. ల ఎంపికలో తప్పటడుగులు వేసి వరుస ప్లాపులు ఖాతాలో వేసుకుంది. కెరీర్ మంచి ఫాంలో కొనసాగాల్సిన సమయంలో ఊహించని వివాదాల్లో చిక్కుకుని ఇండస్ట్రీకి దూరమయ్యింది. జీనియస్ లో స్పెషల్ సాంగ్ చేసింది. ఆ తర్వాత హైదారాబాద్ లో ఓ హోటల్లో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు ఏడేళ్ల పాటు లకు దూరమైన ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యింది.ఇటీవలే శ్వేతా బసు ప్రసాద్ ఊప్స్ అబ్ క్యా అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఫిబ్రవరి 20న ఈ సిరీస్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్వేతా బసు ప్రసాద్.. తాజాగా తెలుగు హీరో గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. తెలుగు సెట్ లో ఆమె వేధింపులకు గురైనట్లు చెప్పుకొచ్చింది. ఎన్నో ఏళ్లుగా ల్లో నటిస్తున్నానని.. కెరీర్ పరంగానే బాగానే ఉందని తెలిపింది. కానీ తెలుగు హీరోతో చేస్తున్న సమయంలో ఎంతో ఇబ్బందిపడినట్లు చెప్పుకొచ్చింది. అతడి హైట్ ఆరు అడుగులు అని.. ఆమె హైట్ 5.2 అడుగులు ఉండడంతో ప్రతి ఒక్కరు ఎగతాళి చేశారని తెలిపింది. ఆ తర్వాత హీరో సైతం తన హైట్ గురించి ప్రస్తావిస్తూ ఎగతాళి చేశాడని చెప్పుకొచ్చింది.అతడు తెలుగు హీరో అయినప్పటికీ తెలుగు మాత్రం సరిగ్గా మాట్లాడలేదని.. అతడి భాష గురించి పట్టించుకోకుండా.. తన హైట్ గురించి కామెంట్స్ చేసినప్పుడు బాధ అనిపించిందని చెప్పుకొచ్చింది. అయితే ఏ సమయంలో ఈ వివాదం జరిగిందనే విషయాన్ని చెప్పలేదు. తెలుగలో రైడ్, కాస్కో, కలవర్ కింగ్, ప్రియుడు, జీనియస్ వంటి చిత్రాల్లో నటించింది. 2016లో చివరగా విజేత చిత్రంలో నటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa