ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 28న విడుదల కానున్న 'బందీ'

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 22, 2025, 12:45 PM

ఆదిత్య ఓం నటించిన 'బందీ'  చిత్రం ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాలలో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. భారతదేశంలో పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో, సందేశాత్మకంగా తెరకెక్కిన తొలి చిత్రం తమదేనని దర్శకుడు రఘు తిరుమల చెబుతున్నారు. ఈ చిత్రాన్ని గల్లీ సినిమా బ్యానర్ పై నిర్మించారు. ఇందులో ఆదిత్య ఓం పాత్ర ఎదుర్కొనే పరిస్థితులు, వాతావరణ సమస్యలపై పోరాడే తీరు అద్భుతంగా ఉండబోతోందని, భారతదేశంతో పాటు ఇతర విదేశాల్లోని అనేక అటవీ ప్రాంతాలలో రియల్ లొకేషన్స్ మధ్య ఈ చిత్రాన్ని తెరకెక్కించామని దర్శకులు తెలిపారు. పర్యావరణ ప్రేమికులను కదిలించేలా ఈ చిత్రం ఉంటుందని ఆయన హామీ ఇస్తున్నారు. 'బందీ' చిత్రాన్ని ఈ నెల 28న విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు వెంకటేశ్వర్ రావు దగ్గు, రఘు తిరుమల తెలిపారు. తొలుత పరిమితమైన స్క్రీన్స్ లోనే దీనిని విడుదల చేసి, ఆ తర్వాత ప్రేక్షకుల స్పందన బట్టి థియేటర్ల సంఖ్య పెంచుతామని అన్నారు. ఈ సినిమాను ఎన్జీఓస్ తోనూ, సామాజిక సంస్థలతోనూ కలిసి ప్రమోట్ చేసే పనిలో ఉన్నట్టు తెలిపారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు మంచి స్పందన లభించిందని మేకర్స్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa