ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేను ఇప్పుడు షూటింగ్‌లో బిజీగా ఉ‍న్నాను : సుప్రీత

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 19, 2025, 03:24 PM

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌పై పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. యూట్యూబర్స్, ఇన్‌ఫ్లూయెన్సర్లపై పంజాగుట్ట పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటికే 11మంది ఇన్‌ఫ్లూయెన్సర్లకు నోటీసులు ఇచ్చారు.తాజాగా మరో ఆరుగురికి నోటీసులిచ్చిన పోలీసులు పోలీసులు. శ్యామల, రీతూ చౌదరి, అజయ్, సుప్రీత, సన్నీ సుధీర్, అజయ్ సన్నీలకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. వీరిలో పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, హర్షసాయి పరారీలో ఉన్నారని తెలుస్తుంది. ఇద్దరూ ఇమ్రాన్, హర్షసాయి దుబాయ్ పారిపోయారని తెలుస్తుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న వారి నుంచి నిర్వాహకుల.. ఆధారాలను సేకరిస్తున్నారు పోలీసులు. రీసెంట్ గా పోలీసుల విచారణకు హాజరైన టేస్టీ తేజాను ఇదే అంశంపై ప్రశ్నించారు.యాప్ నిర్వాహకులు ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నారు, వారి నుంచి ఎలాంటి నజరానా పొందారనే వివరాలు రాబట్టారు పంజాగుట్ట పోలీసులు. హీరోయిన్లు హీరోలతో పాటు మరికొంతమంది ఇన్‌ఫ్లూయెన్సర్లపై నిఘా ఉంచారు. అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారన్న ఆరోపణలో నేపథ్యంలో సురేఖావాణి కూతురు సుప్రీత పేరు కూడా గట్టిగా వినిపిస్తుంది. ఆమెను కూడా అరెస్ట్ చేస్తున్నారని రావడంతో సుప్రీత ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చింది.


ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. 'హాయ్.. అందరికీ నమస్కారం.. నేను మీ సుప్రీత. సోషల్ మీడియాతో పాటు టీవీ ఛానెల్స్‌లో నాపై వస్తున్న ప్రచారాలన్నీ అబద్ధాలు. నేను ఇప్పుడు షూటింగ్‌లో బిజీగా ఉ‍న్నాను. మీరు ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దు. థ్యాంక్‌ యూ సో మచ్‌ ఆల్. మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు' అంటూ చెప్పుకొచ్చింది. ఇక బెట్టింగ్‌ యాప్స్ ప్రమోషన్‌కు సంబంధించి.. విష్ణుప్రియ, టేస్టీ తేజతో పాటు సుప్రీత, రీతూ చౌదరి, హర్షసాయి, పరేషాన్‌ బాయ్స్‌ ఇమ్రాన్‌, కానిస్టేబుల్ కిరణ్‌గౌడ్, బయ్యా సన్నీ యాదవ్‌, లోకల్‌బాయ్‌ నాని, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌, శ్యామలపై కేసులు నమోదు చేశారు పోలీసులు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa