ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏప్రిల్ 11న ఓటీటీలో విడుదల కానున్న అదృశ్యం

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 28, 2025, 08:45 AM

'అదృశ్యం - ది ఇన్విజిబుల్ హీరోస్' సిరీస్, క్రితం ఏడాది ఏప్రిల్ 11వ తేదీన 'సోనీ లివ్'లో స్ట్రీమింగ్ అయింది. ఐజాజ్ ఖాన్ - దివ్యంకా త్రిపాఠి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ కి అన్షుమాన్ కిశోర్ సింగ్ దర్శకత్వం వహించాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాంటి సిరీస్ నుంచి ఇప్పుడు సీజన్ 2 రావడానికి సిద్ధమవుతోంది. 'అదృశ్యం 2 - ది ఇన్విజిబుల్ హీరోస్' పేరుతో ఈ సిరీస్ ప్రేక్షకులను పలకరించనుంది. ఏప్రిల్ 4వ తేదీ నుంచి ఈ సిరీస్ 6 ఎపిసోడ్స్ గా 'సోనీ లివ్'లో అందుబాటులోకి రానుంది. ఐజాజ్ ఖాన్ - పూజా గోర్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ పై అందరిలో ఆసక్తి ఉంది. రీసెంటుగా వదిలిన ఈ సిరీస్ ట్రైలర్ కి రెస్పాన్స్ బాగుంది. కథ విషయానికి వస్తే .. ముగ్గురు తీవ్రవాదులు కశ్మీర్ సరిహద్దుల గుండా రహస్యంగా ఇండియాలోకి ప్రవేశిస్తారు. ఇండియాలోని ప్రధానమైన నగరాలలో విధ్వంసం సృష్టించడానికి పకడ్బందీగా ప్రణాళిక రచన చేస్తారు. ఈ విషయానికి సంబంధించిన సమాచారం అందడంతో, ఇన్విజిబుల్ హీరోలు రంగంలోకి దిగుతారు. తీవ్రవాదులను వాళ్లు ఎలా ఎదుర్కొంటారు? వాళ్ల విధ్వంసాలను వీళ్లు ఆపగలిగారా లేదా అనేది మిగతా కథ. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com