కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370, 35Aని రద్దు చేస్తున్నట్టు మోడీ సర్కార్ సంచలన ప్రకటన చేసిన మరుక్షణంలో భారతీయుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అసలు ఏంటీ ఆర్టికల్ 370, 35ఏ అంటూ దాని గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు కొంతమంది తెలియనివాళ్లు. అసలు ఇన్ని రోజులు కశ్మీర్ ప్రజలు ఏం మిస్ అయ్యారు, అక్కడ పరిపాలన ఏ విధంగా సాగింది అనే దానిపై చర్చలు జరిపారు. అయితే దేశప్రజలందరూ చర్చించుకుంటున్న ఆర్టికల్ 370పై ఓ సినిమా చేసేందుకు టాలీవుడ్ నిర్మాతలు ఫ్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆర్టికల్ 15 పేరుతో ఇటీవల బాలీవుడ్లో ఓ సినిమా విడుదలై సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆర్టికల్ 370 పేరుతో కూడా నిర్మాతలు సినిమా ప్లాన్ చేసేందుకు కసరత్తులు జరుపుతున్నారు. అయితే దాదాపు ఇదే అంశంపైనే టాలీవుడ్లో రూపొందుతున్న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది. వినాయకుడు, విలేజ్లో వినాయకుడు, కేరింత సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు సాయికిరణ్ అడివి .. ఆది సాయి కుమార్ హీరోగా ఆపరేషన్ గోల్డ్ ఫిష్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆర్టికల్ 370 అంశానికి దగ్గరగా ఈ సినిమా ఉంటుందట. చిత్రంలో ఎన్.ఎస్.జి కమెండోగా ఆది కనిపిస్తున్నారు . సాషా ఛెత్రి, కార్తీక్ రాజు, పార్వతీశం, మనోజ్ నందం, అబ్బూరి రవి, కృష్ణుడు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, సెప్టెంబర్లో సినిమాను విడుదల చేయడానికి ఫ్లాన్ చేస్తున్నారు. కశ్మీరీ పండిట్స్ కుటుంబాలని కలిసి అక్కడి పరిస్థితులని పూర్తిగా తెలుసుకొని సినిమా తెరకెక్కించాను. కథని సిద్దం చేయడానికి మూడేళ్ళ సమయం పట్టింది . ఇందులో రాజకీయాలు, దేశభక్తితో పాటు చిన్న ప్రేమ కథ కూడా ఉంటుందని డైరక్టర్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa