టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండ్రోజుల క్రితం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో తాజాగా ఆయనపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి గురువారం అరెస్ట్ చేశారు. జర్నలిస్టుల కాలనీలో నివాసం ఉంటున్న ఆయన ఇంటికి వెళ్తున్న సమయంలో అపసవ్య దిశలో కారు నడిపి.. అడ్డుకున్న ట్రాఫిక్ పోలీసుతో దురుసుగా ప్రవర్తించారు.కాగా, ‘అల్లుడి శీను’తో బెల్లంకొండ శ్రీనివాస్ టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కవచం, రాక్షసుడు, జయ జానకీ నాయకా, సాక్ష్యం.. వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇదే ఊపులో హిందీ ‘ఛత్రపతి’ సినిమాను రీమేక్ చేశాడు. అది కాస్త డిజాస్టర్ కావడంతో సైలెంట్ అయిపోయాడు. ప్రస్తుతం భైరవం అనే మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో పాటు మంచు మనోజ్, నారా రోహిత్లు కూడా నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa