ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'భైరవం' థర్డ్ సింగల్ కి భారీ స్పందన

cinema |  Suryaa Desk  | Published : Fri, May 16, 2025, 12:10 PM

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన రాబోయే చిత్రం 'భైరవం'లో భయంకరమైన మరియు కఠినమైన రూపాన్ని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రంలో నారా రోహిత్ మరియు మనోజ్ మంచులతో నటుడు స్క్రీన్ స్పేస్ ని పంచుకున్నాడు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క థర్డ్ సింగల్ ని డూమ్ దుమారే విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా సాంగ్ మూడు రోజులుగా యూట్యూబ్ లో ట్రేండింగ్ లో ఉన్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమా తమిళ బ్లాక్‌బస్టర్ గరుడన్ యొక్క అధికారిక తెలుగు రీమేక్‌. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అదితి శంకర్, దివ్య పిళై, ఆనంది కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు సందీప్ రాజ్, అజయ్, శరత్, జయసుధ, సంపత్ రాజ్, గోపరాజు రమణ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. సాంకేతిక బృందంలో సినిమాటోగ్రాఫర్ హరి కె వేదాంతం, మ్యూజిక్ కంపోజర్ శ్రీ చరణ్ పాకాల, ఎడిటర్ ఛోటా కె ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మ కడలి ఉన్నారు. ఈ చిత్రానికి సంభాషణలు సత్యర్షి మరియు తూమ్ వెంకట్ అందించగా, భాస్కర భట్ల, కాసర్ల శ్యామ్, చైతన్య ప్రసాద్, బాలాజీ మరియు తిరుపతి సాహిత్యం అందించారు. యాక్షన్‌తో కూడిన సన్నివేశాలకు ఫైట్ మాస్టర్స్ రామకృష్ణ మరియు నటరాజ్ మాడిగొండ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ప్రతిభావంతులైన నటీనటులు మరియు సిబ్బందితో భైరవం ఒక మరపురాని సినిమా అనుభూతిని కలిగిస్తుంది. పెన్ స్టూడియోస్‌కు చెందిన డాక్టర్ జయంతిలాల్ గదా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా మే 30న విడుదల కానుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa