ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేను ప్రజలకి ఎప్పుడు దగ్గరగానే ఉన్నాను

cinema |  Suryaa Desk  | Published : Sat, May 24, 2025, 06:11 PM

దాదాపు తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి పునరాగమనం చేస్తున్నారు నటుడు మంచు మనోజ్. "భైరవం" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆయన, తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత జీవితం, కుటుంబంలో నెలకొన్న వివాదాలపై మనసు విప్పి మాట్లాడారు. ముఖ్యంగా తన సోదరుడు విష్ణు మంచుతో ఉన్న విభేదాలు, తండ్రి మోహన్ బాబుతో తనకున్న అనుబంధం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.తొమ్మిదేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండటంపై మనోజ్ స్పందిస్తూ, "ఆ ఫీలింగ్ నాకే తెలియలేదు. సినిమాలకు దూరంగా ఉన్నా, జనాలకు దగ్గరగానే ఉన్నాను. ఇండస్ట్రీతో టచ్‌లోనే ఉన్నాను. మొదట కొంతకాలం సొంత కారణాలతో దూరంగా ఉన్నా, తర్వాత సినిమా చేద్దామనుకున్నా కుదరలేదు. దేవుడి దయవల్ల ఇప్పుడు మంచి లైనప్‌తో వస్తున్నాను," అని తెలిపారు. "భైరవం" సినిమా ఒరిజినల్ తమిళ వెర్షన్ చూడకుండా, దర్శకుడు విజయ్ కనకమేడల చెప్పిన కథనం నచ్చి చేశానని, ఆయనపై పూర్తి నమ్మకం ఉందని అన్నారు. ఈ చిత్రంలో నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ కూడా నటిస్తున్నారని తెలిసి సంతోషంగా కలిసి పనిచేశామన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa