ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓవర్సీస్ పార్టనర్ ని లాక్ చేసిన '8 వసంతాలు'

cinema |  Suryaa Desk  | Published : Sat, May 31, 2025, 03:55 PM

ప్రఖ్యాత పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ '8 వసంతాలు' అనే కంటెంట్-ఆధారిత చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. తొలి చిత్రం మను విమర్శకుల ప్రశంసలు మరియు అంతర్జాతీయ అవార్డులను అందుకుంది. ఈ చిత్రంలో మ్యాడ్ ఫేమ్ అనంతిక సనీల్ కుమార్ శుద్ధి అయోధ్య అనే మార్షల్ ఆర్ట్స్ నిపుణురాలిగా నటించింది. ఇటీవల విడుదలైన టీజర్ సినిమా పై భారీ బజ్ ని క్రియేట్ చేసింది. ఈ చిత్రం జూన్ 20, 2025న విడుదల కానుంది. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా యొక్క ఓవర్సీస్ రైట్స్ ని ప్రత్యంగిరా సినిమాస్ బ్యానర్ సొంతం చేసుకున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ చిత్రంలో రవి తేజా, హను రెడ్డి, కన్న, మరియు సంజన కీలక పాత్రలలో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని మరియు వై రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ప్రతిభావంతులైన సాంకేతిక సిబ్బందిలో అరవింద్ మూలే ప్రొడక్షన్ డిజైనర్‌గా, శశాంక్ మాలి ఎడిటర్‌గా మరియు బాబాసాయి కుమార్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. యాక్షన్ కొరియోగ్రఫీని వింగ్ చున్ అంజి నిర్వహిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa