ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూడవ షెడ్యూల్ ని ప్రారంభించిన 'బార్డర్ 2'

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 17, 2025, 05:19 PM

హిందీ చిత్ర పరిశ్రమలో లెగసీ ఫ్రాంచైజీల పునరుద్ధరణ పెరిగింది. ఇప్పుడు సన్నీ డియోల్ ఫ్రాంచైజీకి తిరిగి రావడంతో 'బార్డర్ 2' మొదటి ప్రధాన ప్రకటన వచ్చింది. ఈ చిత్రంలో వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్ మరియు అహన్ శెట్టి ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. భారతీయ చలనచిత్రంలో భారీ కాన్వాస్‌పై ఈ చిత్రం మౌంట్ చేయబడింది మరియు డియోల్‌తో పాటు ధావన్‌ను ప్రధాన పాత్రలో నటించటంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. బోర్డర్ 2 మూడవ షెడ్యూల్ చిత్రీకరణను మూవీ మేకర్స్ ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ షెడ్యూల్ ప్రస్తుతం పూణేలో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్ మరియు అహన్ శెట్టి జాయిన్ అయ్యినట్లు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ చిత్రం 2026 జనవరి 23న విడుదల కానుంది. ఈ యాక్షన్, డ్రామా మరియు దేశభక్తిని కలిగి ఉన్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, JP దత్తా మరియు నిధి దత్తా నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa