ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘మహావతార్‌ నరసింహ’ ట్రైలర్‌ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 11, 2025, 06:27 PM

పురాణాల్లోని దశావతారాల స్ఫూర్తితో హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ పది త్రీడీ యానిమేషన్‌ చిత్రాలను నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. ఈ వరుసలో వస్తున్న తొలి చిత్రం ‘మహావతార్‌ నరసింహ’. అశ్విన్‌ కుమార్‌ దర్శకత్వంలో శిల్పా ధావన్‌ నిర్మిస్తున్నారు. ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. హిరణ్యకశిప, ప్రహ్లాద, నరసింహ స్వామి పాత్రలను పరిచయం చేస్తూ ట్రైలర్‌ సాగింది. ఈ సందర్భంగా శిల్పా ధావన్‌ మాట్లాడుతూ ‘నరసింహ స్వామి గర్జన ప్రతి హృదయంలో భక్తి భావన ఉప్పొంగేలా చేస్తుంది’ అని అన్నారు. అశ్విన్‌కుమార్‌ మాట్లాడుతూ ‘ఈ చిత్రం దృశ్యకావ్యంలా ఉంటుంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది’ అని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa