ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మరియు విరాజ్ అశ్విన్ నటించిన రొమాంటిక్ డ్రామా 'బేబీ' టికెట్ విండోస్ వద్ద దాదాపు 100 కోట్లు వాసులు చేసింది. ఈ బోల్డ్ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఇటీవలే నేషనల్ అవార్డుని అందుకుంది. ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ ని ఈటీవీ సినిమా ఛానల్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ఆగష్టు 4న మధ్యాహ్నం 1 గంటకి స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు ఛానల్ ప్రకటించింది. ఈ సినిమాలో సీత, నాగబాబు, హర్ష మరియు ఇతరులు ముఖ్య పాత్రలలో నటించారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి విజయ్ సంగీతాన్ని అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa