టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ 20వ చిత్రం "సుందరకాండ" ఆగష్టు 27న విడుదల కానుంది. ఈ చిత్రానికి వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రోహిత్ సరసన వృతి వాఘని కథానాయికగా నటిస్తుండగా, శ్రీ దేవి విజయ్ కుమార్ ఆమె తల్లిగా నటించారు. ఈ చిత్రంలో నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్ కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ సినిమాని మేకర్స్ భారీగా ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క స్పెషల్ ప్రీమియర్ షోని ఈరోజు రాత్రి 8:30 గంటలకి విజయవాడలోని ట్రెండ్ సెట్ మాల్ లో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రానికి సందీప్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత కాగా, రాజేష్ పెంటకోట ప్రొడక్షన్ డిజైనర్, రోహన్ చిల్లాలే ఎడిటర్ గా ఉన్నారు. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతాన్ని సమకూరుస్తుండగా, ప్రదీష్ ఎమ్ వర్మ చిత్ర విజువల్స్ను సంగ్రహించారు. సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి మరియు రాకేష్ మహంకాళ్ళ త్రయం ఈ సినిమాని నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa