ఎ.హర్షా దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ ఒక చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. 'భాగీ 4' అనే టైటిల్ తో రానున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి భారీ స్పందన లభించింది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా 2 గంటల 43 నిమిషాల రన్ టైమ్ ని కలిగి ఉన్నట్లు ప్రకటించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఈ చిత్రంలో సంజయ్ దత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాని సాజిద్ నదియాడ్వాలా నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa