టాలీవుడ్లో తన అందం, నటనతో స్టార్ హీరోయిన్గా స్థిరపడిన రాశీ ఖన్నా గురించి ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమె అసలు లక్ష్యం నటన కాదని, ఉన్నత చదువులు చదివి ఐఏఎస్ అధికారి కావాలని కలలు కన్నారని తెలియడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఢిల్లీలో పుట్టి పెరిగిన రాశీ ఖన్నా చిన్నప్పటి నుంచి చదువులో మేటిగా పేరు తెచ్చుకున్నారు. పాఠశాలలో ఎప్పుడూ టాపర్గా నిలిచే ఆమె, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్ లిటరేచర్లో పట్టా పొందారు. చదువుపై ఉన్న ఆసక్తితో సివిల్ సర్వీసెస్ వైపు అడుగులు వేయాలని బలంగా నిర్ణయించుకున్నారు. డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే ఒక అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలో కాపీ రైటర్గా కూడా పనిచేశారు.అయితే, విధి ఆమె కోసం మరో మార్గాన్ని సిద్ధం చేసింది. డిగ్రీ సమయంలోనే వచ్చిన మోడలింగ్ అవకాశాలు ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. మోడలింగ్లో రాణిస్తున్న ఆమెకు సినిమా అవకాశాలు తలుపుతట్టాయి. 2013లో జాన్ అబ్రహం హీరోగా వచ్చిన 'మద్రాస్ కేఫ్' చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత 2014లో 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నారు.అక్కడి నుంచి ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. 'తొలిప్రేమ', 'వెంకీ మామ', 'ప్రతిరోజూ పండగే' వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగులో స్టార్ హీరోయిన్గా ఎదిగారు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు కోటికి పైగా పారితోషికం అందుకుంటూ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సత్తా చాటుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంలో నటిస్తున్నారు. ఐఏఎస్ కావాలన్న కలను పక్కనపెట్టి, అనుకోకుండా నటిగా మారిన రాశీ ఖన్నా ప్రయాణం ఎందరికో స్ఫూర్తినిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa