by Suryaa Desk | Thu, Oct 03, 2024, 03:52 PM
మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని బింబిసార సినిమాతో ప్రఖ్యాతి గాంచిన వసిష్ఠ మల్లిడి దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. సోషియో-ఫాంటసీ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ చిత్రానికి 'విశ్వంబర' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఈ చిత్రంలో భారీ VFX ఉంటుంది కాబట్టి, VFX పని కోసం భారీ బడ్జెట్ కేటాయించబడింది. విశ్వంబర గ్రాఫిక్స్పై పలు టాప్ వీఎఫ్ఎక్స్ కంపెనీలు పనిచేస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ రెండు పాటల మినహా మొత్తం పూర్తి అయ్యినట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సాంగ్ షూటింగ్ ని మూవీ మేకర్స్ వచ్చే నెలలో చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా త్రిష కృష్ణన్ నటిస్తుంది. ఆషికా రంగనాథ్, రమ్య పసుపులేటి, ఈషా చావ్లా, అశ్రిత వేముగంటి నండూరి మరియు కునాల్ కపూర్ల ఈ సినిమాలో కీలక పత్రాలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి అకాడమీ అవార్డ్-విజేత MM కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. విశ్వంబర జనవరి 10, 2025న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. UV క్రియేషన్స్ భారీ స్థాయిలోఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
Latest News