తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. అందులో భాగంగానే.. రూ.26 వేల కోట్ల వ్యయంతో రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ ఆర్) నిర్మాణానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ట్రిపుల్ ఆర్ నిర్మాణం పూర్తయితే అనేక పరిశ్రమలు వస్తాయని వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఆ రోడ్డు వెళ్లే ప్రాంతాలకు రిజినల్ రింగ్ రైలు వస్తుందని.. తద్వారా ఆయా ఏరియాలు ఉహించనంతగా అభివృద్ధి చెందుతాయన్నారు. మంగళవారం అంబర్పేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను రూ.760 కోట్లతో ఎయిర్పోర్ట్ తరహాలో తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. కాచిగూడ, నాంపల్లి స్టేషన్లనూ ఆధునికీకరిస్తున్నామని చెప్పారు.
రెండు భాగాలుగా రిజినల్ రింగు రోడ్డు..
రీజినల్ రింగ్ రోడ్ 338 కిలోమీటర్ల ప్రతిపాదిత ఔటర్ రింగ్ రోడ్డు. ప్రస్తుత ఓఆర్ఆర్కు 40 కి.మీ దూరం నుంచి దీన్ని నిర్మించనున్నారు. సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, చౌటుప్పల్, ఆమనగల్లు, షాద్నగర్, సంగారెడ్డి మీదుగా ఈ రోడ్డు వెళుతుంది. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి మరియు పరిసర ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీని అందించడానికి ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్ట్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా నిర్మించబుతుంది. RRR ప్రాజెక్ట్ రెండు భాగాలుగా (ఉత్తర, దక్షిణ) నిర్మిస్తున్నారు. మొదట ఉత్తర భాగం 158 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుండగా.. దానికి జాతీయ రహదారి నెంబర్ కేటాయించారు.
భారతమాల పథకం ఫేజ్-I క్రింద రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం (సంగారెడ్డి-నర్సాపూర్-తూప్రాన్-చౌటుప్పల్) గ్రీన్ ఫీల్డ్ అలైన్మెంట్ మంజూరు కాగా.. భూసేకరణ కొనసాగుతుంది. రీజినల్ రింగు రోడ్డు దక్షిణ భాగం పరిధిలోకి వచ్చే చౌటుప్పల్-ఆమనగల్లు-షాద్నగర్-సంగారెడ్డి మధ్య 182 కిలోమీటర్ల మార్గాన్ని జాతీయ రహదారిగా ప్రకటించేందుకు జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల సుముఖత వ్యక్తం చేశారు. కేంద్రంతో ఇటీవల సంప్రదింపులు జరిపిన రాష్ట్ర ప్రభుత్వం యుటిలీటీస్ ఛార్జీలు భరించేందుకు తాము సిద్దమని చెప్పారు. అయితే సానుకూలంగా స్పందించిన కేంద్రం ఆ ఛార్జీలను కేంద్రమే భరిస్తుందని చెప్పటంతో ప్రాజెక్టులో కదలిక వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa