ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌లో రెండు భారీ అగ్ని ప్రమాదాలు.. భయంతో వణికిపోయిన స్థానికులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 03, 2024, 07:55 PM

హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఇటీవల కాటేదాన్‌లోని ఓ బిస్కెట్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం ఘటన మరవక ముందే నగరంలో తాజాగా.. మరో రెండు భారీ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మల్కాజిగిరి పోలీస్ స్టేషన్‌ పరిధిలోని ఓ ఆయిల్ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చేలరేగాయి. భారీ శబ్దంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించటంతో స్థానికులు భయంతో వణికిపోయారు. ఏం జరుగుతుంతో తెలియక ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ల సాయంతో మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.


కాటేదాన్‌లో ఇవాళ తెల్లవారుజామున మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సాయిబాబా నగర్‌లోని విమల్ ప్లాస్టిక్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. భారీ మంటలకు తోడు దట్టంగా నల్లటి పొగ వ్యాపించటంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. రెండు ఫైర్ ఇంజన్ల సాయంతో అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా పుట్టగొడుగులుగా పరిశ్రమలు పుట్టుకొస్తాన్నాయని స్థానికులు అంటున్నారు. వాటిల్లో ఏమాత్రం ఫైర్ సెఫ్టీ నిబంధనలు ఉండటం లేదని అందుకే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని చెబుతున్నారు.


కాటేదాన్‌లో భారీ అగ్నిప్రమాదం..బిస్కెట్ ఫ్యాక్టరీ దగ్ధం


అగ్ని ప్రమాదంతో రూ. 15 కోట్ల నష్టం..


వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో ఉన్న వ్యవసాయ గోదాంలోనూ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం (ఏప్రిల్ 1) సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో గోదాంలో మంటలు చెలరేగి పొగలు వస్తున్న విషయాన్ని అధికారులు, సిబ్బంది గుర్తించారు. అయితే, కాసేపటికే మంటలు గోదాము మొత్తం వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో గోదాం సిబ్బంది సంబంధిత ఫైర్ స్టేషన్‌కు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫైర్ స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నాలు చేశారు.


గోదాములో మంటలు అదుపు చేయడానికి గోడలు పగలగొట్టాల్సి వచ్చింది. కిటికీలు ఉన్న చోట జేసీబీతో గోడను పగులగొట్టారు. అక్కడి నుంచి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. గోదాంలో దాదాపుగా రూ.15 కోట్ల విలువచేసే వరి ధాన్యం, గోనె సంచులు ఉన్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. మంటలు చెలరేగడానికి షార్ట్ సర్క్యూట్ కారణమా.. ఇతర ఏవైనా కారణాలు ఉన్నాయా అన్న విషయం తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa