కష్టపడ్డా.. పాలమ్మినా.. పూలమ్మినా.. సక్సెస్ అయినా.. అంటూ ఒక్క డైలాగుతో సోషల్ మీడియాను షేక్ చేసిన మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి.. మైక్ పట్టుకుని ఏది మాట్లాడినా వైరల్ కంటెంటే. ఇప్పటికే ఎన్నో సభల్లో ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. తన సక్సెస్ స్టోరీతో ఎంతో మందిలో స్పూర్తి నింపే ప్రయత్నం చేస్తుంటారు. అయితే.. ఆయన చెప్పే పద్ధతి కామెడీగా ఉన్నప్పటికీ అందులో ఎంతో కొంత సీరియస్ మ్యాటర్ ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే.. కొన్నిసార్లు అందరిలో నవ్వులు పూయించేందుకు.. తన జర్నీలోని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా పంచుకుంటూ ఉంటారు మల్లారెడ్డి.
ఈ క్రమంలోనే.. ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మల్లారెడ్డి.. ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన తండ్రి ఎన్నో నోములు నోచుకున్న తర్వాత తాను పుట్టినట్టుగా చెప్పుకొచ్చారు మల్లారెడ్డి. జనాల నుంచి ఇంతగా అభిమానం, ఆదరణ లభించిందంటే.. అది తన అదృష్టం అని మల్లారెడ్డి పేర్కొన్నారు. కార్యకర్తలందర్ని చూస్తుంటే తనకు కడుపు నిండిపోయిందన్నారు. "అందరికీ నా పాదాభివందనాలు. ఇది నా అదృష్టమన్నా.. మా నాన్న ఎన్నో నోములు నోచుకుంటే నేను పుట్టిన అన్నా.. మీరంతా నాకు దొరికారు అంటే మామూలు విషయం కాదన్నా.. ఇంత అభిమానం, ఆదరణ దొరికిందంటే మామూలు విషయం కాదన్నా.. ఎవరికీ దొరకని ఆదరణ మీ మల్లన్నకే దొరికింది. ఇది నా అదృష్టం." అంటూ మల్లారెడ్డి ప్రసంగించారు.
ఈసారి లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నారని మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీజపీ, కాంగ్రెస్లో ఏం లేదని.. దమ్ము, ధైర్యం ఉన్న పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో గెలవాలని బీఆర్ఎస్ పార్టీ కసితో ఉందన్నారు. జాతీయ పార్టీలకు సరైన లీడర్ లేడూ.. సరిపడా కేడర్ లేదు అంటూ చలోక్తులు విసిరారు. బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారని.. పార్టీలోకి రాకపోతే ఫంక్షన్ హాల్ కూలగొడతామని.. ఇళ్లు పడగొడతామంటూ భయపెట్టి లాక్కెళ్తున్నారంటూ మల్లారెడ్డి ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa