ఇటీవల కాలంలో చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీసుకుంటున్నారు. క్షణికావేశానికిలోనై ఎంతో విలువైన ప్రాణాలను గాల్లో కలిపేసుకుంటున్నారు. తాజాగా.. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం అశ్వరావుపల్లిలో అటువంటి ఘటనే చోటు చేసుకుంది. పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనస్థాపంతో ఓ డిగ్రీ స్టూడెంట్ ప్రాణాలు తీసుకుంది. ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మస్సి పరమేశ్ పంచాయతీ సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. రెండో కూతురు సోని (20) జనగామలోని ఓ ప్రైవేటు డిగ్రీ కాలేజీలో బీఏ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఫస్ట్, సెకండ్ ఇయర్ సెమిస్టర్ పరీక్షల్లో నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యింది. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పకుండా మనస్తాపంతో ఇంటి వద్ద ముభావంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆదివారం (ఏప్రిల్ 7) ఉదయం తాను ఇంటర్వ్యూకు హైదరాబాద్కు వెళ్తున్నానని తమ్ముడు సంతోష్తో చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లింది.
నేరుగా నిడిగొండ బ్రిడ్జి వద్దకు వెళ్లి ట్రైన్ కింద పడుకొని ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. మృతురాలి వద్ద లభ్యమైన గుర్తింపు కార్డుల ఆధారంగా తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని చూసిన కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే పరీక్షలే జీవితం కాదనే విషయాన్ని నేటి తరం విద్యార్థులు గమనించారు. చదువు జీవితంలో ఓ భాగం మాత్రమేనని అన్నారు. చాలా మంది తాము అనుకున్న రంగంలో సక్సెస్ అయ్యారు. పరీక్షల్లో ఫెయిల్ అయినా.. జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకున్నారు. అలాంటి వారిని స్పూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలే కానీ.. ఆత్మహత్యలు చేసుకోవటం సరైంది కాదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa