ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అతి తక్కువ ధరలో యాదాద్రి ట్రిప్.. కొలనుపాక కూడా వెళ్లొచ్చు, వివరాలివే.

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, May 12, 2024, 05:13 PM

తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రికి భక్తుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఆలయ పునర్నిర్మాణం తర్వాత రోజూ వేల సంఖ్యలో భక్తులు యాదాద్రి లక్ష్మీనర్సింహ్మా స్వామిని దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ టూరిజం డిపార్ట్‌మెంట్ భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పింది. యాదాద్రితో పాటు మరికొన్ని ఆలయాలను చూసేందుకు ప్యాకేజీని ప్రకటించింది. అతి తక్కువ ధరలోనే ప్రతి శనివారం ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. బస్సు జర్నీ ద్వారా ఈ ప్యాకేజీనిని అందిస్తున్నారు.


అయితే హైదరాబాద్ నుంచి వెళ్లే భక్తులకు మాత్రమే ఈ ప్యాకేజీని ఆఫర్ చేస్తున్నారు. ప్రతి శనివారం ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ఏసీ మినీ కోచ్‌లో జర్నీ ఉంటుంది. టికెట్ ధరలు పెద్దలకు అయితే రూ. 1499, పిల్లలకు రూ.1199గా నిర్ణయించారు. కేవలం ఒకే ఒక్క రోజులో ఈ ప్యాకేజీ ద్వారా దర్శనం చేసుకొని ఇంటికి చేరుకోవచ్చు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లోని బషీర్ బాగ్ నుంచి బస్సు ప్రారంభం అవుతుంది. 10:30 గంటలకు కొలనుపాకకు చేరుకుంటారు. అక్కడ పురాతన జైన్ ఆలయాన్ని దర్శించుకునే అవకాశం కల్పించారు.


11:30 గంటలకు కొలనుపాక నుంచి బయల్దేరుతారు. 12:30 గంటలకు యాదగిరిగుట్టలోని ఆలయాన్ని సందర్శిస్తారు. దర్శనం తర్వాత 1:30 PM to 2:00 PM మధ్య హరిత హోటల్‌లో భోజనం అందిస్తారు. అయితే భోజనాలు ఖర్చు సొంతంగా భరించాల్సి ఉంటుంది. సాయంత్రం 4:30 గంటలకు సమీపంలోని సురేంద్రపురికి తీసుకెళ్తారు. ఇక్కడ ప్రముఖ ఆలయాల సెట్టింగులను చూడొచ్చు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి రాత్రి 9:30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు. https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్‌లోకి వెళ్లి బుకింగ్‌తో పాటు పూర్తి వివరాలను తెలుకోవచ్చునని టూరిజం అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa