రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి బైపోల్ జరుగుతుంది. ఏపీలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగుతుంది. ఈ ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కను వినియోగించుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లోని తమ తమ పోలింగ్ స్టేషన్లలో సినీ సెలబ్రెటీలు చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు ఓటేశారు. సినీ నటి మంచు లక్ష్మి జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో తన ఓటు హక్కును వినియోగించుకుంది. ఓటు వేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ ఓటర్లుపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. తాను ఓటేసే సమయానికి తక్కువగా ఓటింగ్ శాతం నమోదు కాగా.. నగర ఓటర్లపై మండిపడ్డారు. నిజంగా ఇది సిగ్గు చేటని చెప్పారు. తాను ఓటేయటానికి బాంబే నుంచి నగరానికి వచ్చినట్లు చెప్పుకొచ్చారు.
'ఓటేయటం అనదే మూమాలు హక్కు కాదు. ఈ దేశం అభివృద్ధి చెందటానికి, మన వాయిస్ వినిపించడానికి తప్పకుండా బయటకు వచ్చి ఓటు వేయాలి. నాదో విన్నపం.. కొన్ని ఎన్నికల నిబంధనలు మారితే బాగుటుంది. నేను ఓటు వేయటానికి ప్రస్తుతం బాంబే నుంచి రావాల్సి వచ్చింది. నాలాంటి ఎంతో మంది వేరే ప్రాంతాల్లో ఉండటం వల్ల వెనక్కి వచ్చి ఓటేయలేకపోతున్నారు. ఇలా బయట ప్రాంతాల్లో ఉండేవారికి ఈజీగా ఓటేసేందుకు ఓ మార్గం చూపిస్తే బాగుటుందనేది నా విన్నపం. కానీ హైదరాబాద్లో ఇప్పటి వరకు 5 శాతం మందే ఓటేసినట్లు తెలిసింది. నిజంగా ఇది సిగ్గుచేటు. యువత బయటకు రావాల్సిన సమయం ఆసన్నమైంది. ఓటు ద్వారా మీ వాయిస్ వినిపించండి.. మీ పవర్ ఎంటో చూపించండి.. ప్రపంచం ఎదురు చూస్తుంది. బయటకు వచ్చి ఓటేయండి.' అని మంచు లక్ష్మీ హైదరాబాద్ ఓటర్లకు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa