ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాహనదారులకు డేంజర్ అలర్ట్.. ఆ మార్గంలో 17 'బ్లాక్ స్పాట్స్' గుర్తింపు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, May 17, 2024, 07:24 PM

వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో.. ఆ మార్గంలో 17 బ్లాక్ స్పాట్స్‌‌ను ప్రభుత్వం గుర్తించింది. కాగా.. ఈ బ్లాక్ స్పాట్స్ మీద.. మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే.. ఈ మార్గంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండటం, అందులోనూ వచ్చేది వానాకాలం కావటంతో.. బ్లాక్ స్పాట్స్, ఆయా ప్రాంతాల్లో పాటించాల్సిన సేఫ్టీ మెజర్స్‌ మీద సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి ఈఎన్సీ గణపతిరెడ్డి, జాతీయ రహదాహదారుల శాఖ రీజినల్ ఆఫీసర్ రజాక్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. నిర్వహించారు.


హైదరాబాద్- విజయవాడ జాతీయరహదారిపై గుర్తించిన 17 బ్లాక్ స్పాట్స్...


1. చౌటుప్పల్ (52840-5530)


2. పెదకాపర్లి


3. చిట్యాల


4. కట్టంగూర్


5. ఇనుపాముల


6. టెక్మట్ల


7. ఎస్.వీ.కాలేజ్ జనగాం ఎక్స్ రోడ్


8. ఈనాడు జంక్షన్


9. దురాజ్ పల్లి జంక్షన్


10. ముకుందాపూరం


11. అకుపాముల


12. కోమరబండా ఎక్స్ రోడ్డ్


13. కాటకమ్మగూడెం


14. మేళ్లచెరువు


15. శ్రీరంగాపురం


16. రామాపురం ఎక్స్ రోడ్డు


17. నవాబ్ పేట్ జంక్షన్


ఈ 17 ప్రాంతాల్లో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్టు రహదారుల శాఖ గుర్తించింది. దీంతో.. ఈ ప్రాంతాల్లో భద్రతా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ముఖ్యంగా సైన్ బోర్డ్స్, హెవీ స్పీడ్ నిర్మూలన, కొన్నిచోట్ల ఆరు లేన్లుగా రోడ్డు నిర్మాణం చేయడం, జంక్షన్ డెవలప్ మెంట్స్, వెహికిల్ అండర్ పాస్ ల నిర్మాణం, రెండు వైపుల సర్వీస్ రోడ్ల నిర్మాణం వంటి చర్యలతో బ్లాక్ స్పాట్స్ ప్రాంతాల్లో ప్రమాదాలను నివారించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.


ఈ మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు... ప్రభుత్వం గుర్తించిన 17 బ్లాక్ స్పాట్ ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని.. కొంచెం జాగ్రత్తగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. వాహనదారుల జాగ్రత్తే.. ప్రమాదాల నివారణకు ప్రధాన చర్య అని చెప్తున్నారు. నిర్లక్ష్యం, అతివేగం లాంటి విషయాల్లో వాహనదారులు అప్రమత్తంగా ఉంటే.. వాళ్లకే కాకుండా ఇతరులకు కూడా మంచిదని సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa