తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి ముగియటంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన అక్రమాలపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోళ్లు, గొర్రెల స్కామ్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలపై విచారణ వేగవంతం చేసింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. భద్రాద్రి, యాదాద్రి, ఛత్తీస్ఘడ్ విద్యుత్ కొనుగోలు విషయంలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు నోటీసులు జారీ అయ్యాయి.
విద్యుత్ అంశాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో నిజనిర్ధారణ కోసం వేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఈ నోటీసులు జారీ చేసింది. ఈనెల 15 లోపు వివరణ ఇవ్వాలని జస్టిస్ నరసింహా రెడ్డి నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులపై స్పందించిన కేసీఆర్.. తనకు కొంత గడువు కావాలని కోరినట్లు తెలిసింది. ఎన్నికల హడావుడి దృష్ట్యా జులై 30 వరకు గడువు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది.
ఇక విద్యుత్ అంశాల్లో అవకతవకలపై కమిషన్ బహిరంగ ప్రకటన జారీ చేసి, ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. సోమవారం (జూన్ 10) ట్రాన్స్కో, జెన్ కో మాజీ సీఎండీ ప్రభాకర్ రావు, గత ప్రభుత్వంలో మాజీ ముఖ్య కార్యదర్శిగా పని చేసిన సురేశ్ చందాను కమిషన్ విచారించింది. ఈ సందర్భంగా ప్రభాకర్ రావు కమిషన్ ముందు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఇదిలా ఉండగా.. తాను కొద్దికాలమే ఆ శాఖకు కార్యదర్శిగా ఉన్నానని.. తన హయాంలో ఎలాంటి ఒప్పందాలు జరగలేదని సురేశ్ చందా కమిషన్కు వివరణ ఇచ్చారు.
విద్యుత్ కొనుగోళ్ల అంశాలపై విచారణ జరిపి మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని జస్టిస్ నర్సింహారెడ్డి ఏకసభ్య కమిషన్ను తెలంగాణ ప్రభుత్వం కోరిన సంగతి తెలిసిందే. ఆ గడువు ఈ నెలాఖరుతో ముగియనుండగా.. ఆలోగా విచారణ పూర్తయ్యే పరిస్థితులు కనిపించట్లేదు. కేసీఆర్ వివరణ ఇచ్చేందుకు గడువు కోరటంతో కమిషన్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa