ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుపతికి బయలుదేరిన కోనాపూర్ భజన మండలి సభ్యులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 05, 2024, 04:45 PM

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామం నుండి మాణిక ప్రభు భజన మండలి భక్తులు శుక్రవారం తిరుపతికి బయలుదేరారు. ఆదివారం తిరుమలలో రెండు గంటల పాటు భజన కార్యక్రమం నిర్వహిస్తారు. గత ఆరు సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు మాణిక ప్రభు భజన మండలి కోనాపూర్ గ్రామం వారికి ఆహ్వానిస్తారు. వీరిలో శ్రీనివాస్ చారి, సాయి క్రిష్ణ, నారాయణ, వీరభద్రప్ప, మోతిలాల్, రాజారాం, నరేష్ తదితరులు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa